Mane Praveen

May 08 2024, 22:11

NLG: నామినేషన్ వేసిన MLC అభ్యర్థి పోతుల గంగిరెడ్డి కోటిరెడ్డి
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఆరవ రోజు బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా పోతుల గంగిరెడ్డి కోటిరెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన కు అందజేశారు.

Mane Praveen

May 08 2024, 22:07

NLG: ఎమ్మెల్సీ అభ్యర్దిగా నామినేషన్ వేసిన పాలకూరి అశోక్
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్దిగా పాలకూరి అశోక్, బుధవారం నల్లగొండలో నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి దాసరి హరిచందన కు అందజేశారు.

నాగార్జున ప్రభుత్వ కళాశాల నుండి భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. యువకులు ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Mane Praveen

May 08 2024, 22:04

ఎర్ర జెండా పేదలకు అండ: సిపిఎం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున
మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్ ను గెలిపించాలని, మద్యం డబ్బు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు.

ఈరోజు మర్రిగూడ మండలం కొండూరు, వట్టిపల్లి, బట్లపల్లి , మర్రిగూడలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎర్రజెండా ఏనాటికైనా పేదలకు అండ అని, ఎర్రజెండా నీడనే పేదల హక్కులు కాపాడబడతాయని, నిరుపేదలు తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకాలంటే సిపిఎం గెలవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, మండల నాయకులు కొట్టం యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 07 2024, 16:46

NLG: ఇందుర్తి మేటిచందాపురం గ్రామాలలో సిపిఎం ప్రచారం
మర్రిగూడ మండలం, ఇందుర్తి మేటిచందాపురం గ్రామాలలో భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి కామ్రేడ్ జహంగీర్ ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల  యాదయ్య మాట్లాడుతూ.. మత రాజ్యం వద్దు ప్రజాస్వామ్యం హద్దుగా పనిచేయాలని, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పని చేసే అభ్యర్థి, నిరంతరం ప్రజల తరఫున నిలబడుతూ వారి హక్కుల కోసం పోరాడే జహంగీర్ ను గెలిపించాలని కోరారు.

తెలంగాణ రైతాంగ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న సిపిఎం పార్టీని గెలిపించాలని దేశ రాజకీయాల్లో విశిష్టత స్థానాన్ని సంపాదించుకుందని ఆయన అన్నారు పేదలు కష్టజీవుల తరఫున నీతితో నిజాయితీతో పోరాడుతున్నది ఎర్రజెండా ఒక్కటే అని అన్నారు.

పేదల కోసం కార్మికుల కోసం పోరాటం చేసే సిపిఎం అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాలని ఆయన అన్నారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో పగిల్ల రాములు, దుర్గమ్మ, వెంకటయ్య, శివ, నందిని, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

May 07 2024, 08:36

NLG: లెంకలపల్లి: పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించిన భక్తులు
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు (పెద్దమ్మ తల్లి పండుగ)  సందర్భంగా సోమవారం సాయంత్రం గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

May 06 2024, 21:46

నాంపల్లి మండలం స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం
నాంపల్లి: పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైంది. ప్రజలందరి దీవెనలతో ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది. ఇప్పుడు ఆదర్శ తెలంగాణను తీర్చిదిద్దుకుందామని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఇంచార్జీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.నియంతృత్వ బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయడమే తన లక్ష్యమన్నారు.

సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో మండలం స్థాయి బూత్ కమిటీ సభ్యుల విస్తృతస్థాయి సమావేశం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు అభివృద్ధిని చేయలేరన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగు, త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని బీజేపీ, బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలను నమ్మవద్దని  భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని తనను ఆదరించినట్లే అతనిని కూడా ఆదరించాలని అన్నారు. నాంపల్లి మండలం నుండి భారీ మెజార్టీని తేవాలని అన్నారు.

నక్కలగండి పూర్తి చేసి కిష్ణరాంపల్లి, చర్లగూడెం, ప్రాజెక్టుల ద్వారా సాగు, త్రాగునీరు, మునుగోడు నియోజకవర్గ ప్రజలు అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. గత పది ఏళ్లలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో దేశ చరిత్రలోనే గుర్తింపు ఉండేలాగా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కార్యకర్తలను కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలిచి తీరుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ప్రతి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతుబంధు రాని వారికి ఈనెల 9 నుండి రైతుబంధు, అందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో  పీసీసీ రాష్ట్ర కార్యనిర్వణ కార్యదర్శి పున్న కైలాస్, నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు  ఏరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, గజ్జల శివారెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మేకల రమేష్ ముదిరాజ్, పానుగంటి వెంకన్న, విష్ణువర్ధన్ రెడ్డి, కొమ్ము బిక్షం, అంగిరేకుల పాండు, సుధనబోయిన శ్రీను యాదవ్, దండిగ అలివేలు నరసింహ, కోరే యాదయ్య, పోగుల దివ్య, అబ్బనబోయిన చంద్రమౌళి, బొల్లంపల్లి విష్ణుమూర్తి, మెగావత్ రవి నాయక్, మెగావత్ దీప్లా నాయక్, అన్నేపాక కిరణ్, సింగిల్ విండో చైర్మన్ నర్సిరెడ్డి, దామర యాదగిరి, దొటి పరమేష్ యాదవ్, రేవల్లి సుధాకర్, గుండాల అంజయ్య, ఈద శేఖర్, మారేపాకుల కొండలు, దూదిమెట్ల యాదగిరి, సురేందర్ నాయక్ పానుగంటి వెంకటయ్య, గాదేపాక నాగరాజు, వడ్డేపల్లి సైదులు, కలకొండ దుర్గయ్య, జమ్లా నాయక్, కామిశెట్టి చత్రపతి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 06 2024, 16:04

NLG: ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ D లైసెన్స్ కోచ్ కోర్సు కొరకు సదుపాయాల పరిశీలన
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ విజన్ 2047  ప్రకారం భారతదేశం లో 10లక్షల మంది ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో గ్రాస్ రూట్ లో ప్రొఫెషనల్ ఫుట్బాల్ కోచ్ లను తయారు చేయాలనే కార్యాచరణలో భాగంగా,   తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సారథ్యంలో మే నెల చివరి వారంలో 7 రోజులపాటు  *D లైసెన్స్ కోచ్ కోర్సు* ను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయుటకు భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉన్న సదుపాయాలను తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి GP ఫల్గుణ ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని 24 మంది ఈ కోర్సు ను  పూర్తి చేయడానికి గాను ఫుట్బాల్ గ్రౌండ్,సెమినార్ హాల్, డైనింగ్ హాల్, డిజిటల్ క్లాస్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్ తదితర సదుపాయాలకై పూర్తి పరిశీలన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా TFA ప్రధాన కార్యదర్శి GP ఫల్గుణ మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడాకారులకు *D లైసెన్స్ కోర్స్* ను భువనగిరి పట్టణంలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేయడానికి యాజమాన్యంతో చర్చించడం జరిగిందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడను ఎక్కువమంది నిరుపేద క్రీడాకారులు ఆడతారని వారికి తక్కువ ఫీజు తో ఈ కోర్సును పూర్తి చేయడానికి న్యూ డైమెన్షన్ స్కూల్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ TFA ఆధ్వర్యంలో *D లైసెన్స్ ప్రొఫెషనల్ కోచ్ ల కోర్స్* ను పప్రధమంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసే ప్రక్రియను TFA ప్రారంభించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అది తెలంగాణ రాష్ట్రంలోని ఫుట్బాల్ క్రీడాకారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ గడసంతుల మధుసూదన్ ఆధ్వర్యంలో  రాష్ట్ర సెక్రెటరీ GP ఫల్గుణ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మరియు TFA అసోసియేట్ లను శాలువాతో ఘనంగా సన్మానించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి లడ్డు ప్రసాదాలను అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ మద్ది కర్ణాకర్, ఫుట్బాల్ కోచ్ ప్రభాకర్, బీసీ గురుకుల ఫిజికల్ డైరెక్టర్ గడసంతుల భాస్కర్,TFA టెక్నికల్ కోఆర్డినేటర్ జాయ్ సామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 05 2024, 18:29

NLG: చండూరు లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం
చండూరు మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం అంతా తీవ్రమైన ఎండ గా ఉన్న వాతావరణం, సాయంత్రం సమయానికి ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. మండుతున్న ఎండల నుండి కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

చండూరు మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం అంతా తీవ్రమైన ఎండ గా ఉన్న వాతావరణం, సాయంత్రం సమయానికి ఒక్కసారిగా చల్లబడి ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన

Mane Praveen

May 05 2024, 16:44

NLG: ముమ్మరంగా కొనసాగుతున్న చత్రపతి శివాజీ (CSL) ఫుట్బాల్ లీగ్స్.. ముఖ్య అతిథిగా పాల్గొన్న PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం

నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారుల లో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 11 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఈరోజు నిర్వహించిన మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరీ మ్యాచ్ జరగగా 2-2 స్కోర్ నిర్ణీత సమయానికి రెండు జట్లు సమ స్కోర్టు తో నిలిచి మ్యాచ్ డ్రా గా ముగియడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా PRTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ రావడం, క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. 

సుంకరి బిక్షం గౌడ్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడా ఎంతో గొప్పదని, ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ ఫుట్బాల్ అని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడల్లో రాణించాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయిలో రాయించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని నిరంతరం సాధన చేయాలని అన్నారు.

నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా గొప్పవని వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు ను ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ లను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం క్రీడాకారులకు

 శ్రీసత్యం వర్మీ బయో ఆర్గానిక్స్ వారు అందజేసిన బిస్కెట్ ప్యాకెట్లు-సాఫ్ట్ డ్రింక్ లు పంపిణీ చేశారు. ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, వెంకటసాయి, యశ్వంత్, శివదాసు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 05 2024, 14:22

TG: శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

ఈ రోజు మేడ్చల్ జిల్లా,కీసర మండలం, చీర్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా సమృద్ధిగా వర్షాలు పడి, కరువు అంతమై, పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ బ్రహ్మోత్సవాలలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.